పట్నాలో 10వతేదీ నుంచి మళ్లీ లాక్‌డౌన్

ABN , First Publish Date - 2020-07-09T13:09:12+05:30 IST

కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీహార్ రాజధాని నగరమైన పట్నాలో ఈ నెల 10 నుంచి 16వతేదీ వరకు 7 రోజుల పాటు మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నట్లు...

పట్నాలో 10వతేదీ నుంచి మళ్లీ లాక్‌డౌన్

కలెక్టర్ ఉత్తర్వులు

పట్నా (బీహార్): కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీహార్ రాజధాని నగరమైన పట్నాలో ఈ నెల 10 నుంచి 16వతేదీ వరకు 7 రోజుల పాటు మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ జిల్లా మెజిస్ట్రేట్ కుమార్ రవి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత మూడు వారాలుగా పట్నా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న దృష్ట్యా దీన్ని కట్టడి చేసేందుకు మళ్లీ వారం రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు కలెక్టరు ప్రకటించారు. లాక్ డౌన్ సందర్భంగా అన్ని మతాల ప్రార్థనామందిరాలను మూసివేయాలని కలెక్టరు ఆదేశించారు. పండ్లు, కూరగాయలు, మాంసం, చేపల దుకాణాలు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు తెరచి ఉంచుతామని కలెక్టరు చెప్పారు. ఒక్క బుధవారం రోజే బీహార్ లో 749 కరోనా కేసులు బయటపడ్డాయి. బీహార్ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,274కు పెరిగింది. కరోనా వ్యాప్తి చెందుతున్నందున బీహార్ సచివాలయంతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోకి సందర్శకులను అనుమతించమని సర్కారు ప్రకటించింది. 

Updated Date - 2020-07-09T13:09:12+05:30 IST