ఫోరెన్సిక్ ల్యాబ్‌కు రాకుండా వైసీపీ నేతల పుత్రరత్నాలు ముఖం చాటేశారు: పట్టాభి

ABN , First Publish Date - 2021-10-01T17:07:40+05:30 IST

రామాంతపూర్ సెంట్రల్ మాదాక ద్రవ్యాల ఫోరెన్సిక్ ల్యాబ్ వద్దకు ఏపీ టీడీపీ నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడుతూ..

ఫోరెన్సిక్ ల్యాబ్‌కు రాకుండా వైసీపీ నేతల పుత్రరత్నాలు ముఖం చాటేశారు: పట్టాభి

హైదరాబాద్: రామాంతపూర్ సెంట్రల్ మాదాక ద్రవ్యాల ఫోరెన్సిక్ ల్యాబ్ వద్దకు ఏపీ టీడీపీ నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడుతూ.. డ్రగ్ టెస్ట్‌కు రాకుండా వైసీపీ నేతలు తోక ముడిచారన్నారు. దేశంలో డ్రగ్ మాఫియా వెనుక వైసీపీ నేతలు ఉన్నారని తేటతెల్లమయ్యిందన్నారు. రామాంతపూర్ సెంటర్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు రాకుండా వైసీపీ నేతల పుత్రరత్నాలు ముఖం చాటేశారని విమర్శించారు. వైసీపీ నేతలు ఎప్పుడూ పిలిచినా డ్రగ్ టెస్ట్‌కు తాము సిద్ధమని పట్టాభి స్పష్టం చేశారు.

Updated Date - 2021-10-01T17:07:40+05:30 IST