పట్టాభిని కస్టడీకి ఇవ్వండి: పోలీసులు
ABN , First Publish Date - 2021-10-23T01:26:12+05:30 IST
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గవర్నరుపేట పోలీసులు విజయవాడలోని
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గవర్నరుపేట పోలీసులు విజయవాడలోని మూడో ఏసీఎంఎం కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ‘‘పట్టాభి వ్యాఖ్యల వెనుక వివిధ కోణాలు ఉన్నాయి. ఆయన చేస్తున్న వ్యాఖ్యల వల్ల శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. ఉద్దేశ్యపూర్వకంగానే పట్టాభి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనను ఇంకా విచారించాల్సి ఉంది’’ అని పిటిషన్లో పేర్కొన్నారు. ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీనిపై నిందితుడు పట్టాభికి నోటీసులు జారీ చేయాలని ఈనెల 25వ తేదీకి న్యాయమూర్తి సత్యాదేవి వాయిదా వేశారు.