‘అప్పుడు అలీ బాబా.. ఇప్పుడు జగన్ బాబా’

ABN , First Publish Date - 2020-02-22T23:07:26+05:30 IST

అవినీతి ఊబిలో కూరుకుపొన జగన్మోహన్ రెడ్డి.. దొంగ పత్రికను చేతిలో పెట్టుకుని ఇతరులపై కూడా బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాడని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు.

‘అప్పుడు అలీ బాబా.. ఇప్పుడు జగన్ బాబా’

అమరావతి: అవినీతి ఊబిలో కూరుకుపోయిన జగన్మోహన్ రెడ్డి.. దొంగ పత్రికను చేతిలో పెట్టుకుని ఇతరులపై కూడా బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాడని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. చిన్నతనంలో అలీబాబా అరడజన్ కథ విన్నట్లుగానే.. ఇప్పుడు జగన్ బాబు జగమెరిగిన దొంగల కథ వింటున్నాం అని అన్నారు. ఆస్తులపై వైసీపీ నాయకులకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని పట్టాభి సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన క్రిమినల్ గెజిట్‌ను చూసి వైసీపీ నాయకులకు వణుకు మొదలైందన్నారు. బీసీలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్లే అచ్చెన్నాయుడిపై అక్రమ ఆరోపణలు చేస్తున్నారని పట్టాభి ఫైర్ అయ్యారు.

Updated Date - 2020-02-22T23:07:26+05:30 IST