పట్టాభిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు: టీడీపీ శ్రేణులు

ABN , First Publish Date - 2021-10-24T04:33:09+05:30 IST

పట్టాభిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు: టీడీపీ శ్రేణులు

పట్టాభిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు: టీడీపీ శ్రేణులు

అమరావతి: టీడీపీ నేత పట్టాభి కారు వెంట వస్తోన్న మిగిలిన వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. పొట్టిపాడు టోల్‌గేట్ దగ్గరకు నాలుగు వాహనాలతో పోలీసులు  వచ్చారు. పట్టాభి కారుతో వస్తోన్న వాహనాలను నిలిపివేశారు. పట్టాభి కారుకు ముందూ వెనుకా పోలీసులు తమ వాహనాలను ఉంచి తీసుకెళ్తొన్నారు. పట్టాభిని ఎక్కడకు తీసుకెళ్తున్నారో చెప్పడం లేదంటూ టీడీపీ శ్రేణులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  కాగా పట్టాభికి బెయిల్ మంజూరైంది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే పట్టాభి వెంట పోలీసుల వాహనాలు రావడంపై టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. 

Updated Date - 2021-10-24T04:33:09+05:30 IST