బెదిరింపులకు, దాడులకు భయపడేది లేదు: పట్టాభి

ABN , First Publish Date - 2021-11-08T17:27:26+05:30 IST

వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు, దాడులకు భయపడేది లేదని టీడీపీ నేత పట్టాభిరామ్ స్పష్టం చేశారు.

బెదిరింపులకు, దాడులకు భయపడేది లేదు: పట్టాభి

విజయవాడ: వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు, దాడులకు భయపడేది లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిజాలు మాట్లాడుతున్నందుకు వైసీపీ శ్రేణులు తనపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికి మూడు సార్లు తనపై దాడులు చేశారన్నారు. ఏ నాయకుడు అవినీతికి పాల్పడినా ఎండగడుతామని ఆయన స్పష్టం చేశారు.


నిజాయతీ గల నాయకుడు చంద్రబాబు సారథ్యంలో నడుస్తున్నామని, పసుపు సైనికులు వెనకడుగు వేసే ప్రసక్తే లేద పట్టాభిరామ్ అన్నారు. వైసీపీకి రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి ఇప్పుడు గుర్తొచ్చిందా? అని ఎద్దేవా చేశారు. ఆధారాలతోనే అధికార పార్టీని ప్రశ్నిస్తున్నామన్నారు. ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజలపై అనేక రకాల భారాలు మోపుతోందని, దానిలో భాగంగానే ఏడాది కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచారని పట్టాభి ఆరోపించారు.

Updated Date - 2021-11-08T17:27:26+05:30 IST