డీజీపీని సూటిగా ప్రశ్నించిన పట్టాభిరామ్

ABN , First Publish Date - 2020-09-29T21:08:16+05:30 IST

డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను టీడీపీ నేత పట్టాభిరామ్ సూటిగా ప్రశ్నించారు. డీజీపీ మరీ ఇంతలా దిగజారతారా అని నిలదీశారు. టీడీపీ అధినేత చంద్రబాబు లేఖపై స్పందించిన డీజీపీ..

డీజీపీని సూటిగా ప్రశ్నించిన పట్టాభిరామ్

అమరావతి: డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను టీడీపీ నేత పట్టాభిరామ్ సూటిగా ప్రశ్నించారు. డీజీపీ మరీ ఇంతలా దిగజారతారా అని నిలదీశారు. టీడీపీ అధినేత చంద్రబాబు లేఖపై స్పందించిన డీజీపీ.. మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు లేఖరాసినట్లుగానే విజయసాయికి డీజీపీ లేఖ రాయగలరా? అని ప్రశ్నించారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా కొడాలి నాని మాట్లాడినా డీజీపీ ఎందుకు స్పందించడంలేదు? .. వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చని చట్టం చెబుతుంటే డీజీపీ ఆ పని ఎందుకు చేయరు?.. తనటోపీపై ఉన్న మూడు సింహాలను డీజీపీ తాడేపల్లి ప్యాలెస్‌లో తాకట్టు పెట్టారా? అని ప్రశ్నించారు. రామచంద్రపై హత్యాయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పట్టాభిరామ్ ప్రశ్నించారు. 

Updated Date - 2020-09-29T21:08:16+05:30 IST