AP fiber net లో అవినీతి జరిగిందని నిరూపిస్తారా..?: పట్టాభి

ABN , First Publish Date - 2021-07-19T21:29:24+05:30 IST

ఏపీ ఫైబర్ నెట్లో అవినీతి జరిగిందని ఆధారాలతో సహా నిరూపించాలని వైసీపీ నేతలకు తెలుగుదేశం జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సవాల్ విసిరారు.

AP fiber net లో అవినీతి జరిగిందని నిరూపిస్తారా..?: పట్టాభి

అమరావతి: ఏపీ ఫైబర్ నెట్‌లో అవినీతి జరిగిందని ఆధారాలతో సహా నిరూపించాలని వైసీపీ నేతలకు తెలుగుదేశం జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సవాల్ విసిరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నారా చంద్రబాబునాయుడు, లోకేశ్‌ని జైలుకు పంపుతామని వైసీపీ నేతలు పిచ్చికూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో పకోడి పేపర్, అవినీతి ఛానల్ ఉన్నాయి కదా అని నోళ్లకు పనిచెప్పడంకాదని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలకు నిజంగా దమ్ము, ధైర్యముంటే, ఏపీ ఫైబర్ నెట్‌లో అవినీతి జరిగిందని ఆధారాలతో సహా నిరూపించే సత్తా ఉంటే, తనతో బహిరంగచర్చకు రావాలని సవాల్ విసిరారు. రూ.149కే మూడురకాల (కేబుల్, ఇంటర్నెట్, టెలిఫోన్) సౌకర్యాలను చంద్రబాబునాయుడు అందిస్తే, సీఎం జగన్ దాన్ని రూ.300లకు పెంచారని ధ్వజమెత్తారు. జగన్మోహన్‌రెడ్డి ఈ రెండేళ్లలో చేసిన అవినీతి, దోపిడీకి ఆయన్ని లక్షసార్లు జైలుకు పంపాలని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ హెచ్చరించారు. 

Updated Date - 2021-07-19T21:29:24+05:30 IST