రేపటి నుంచి పట్టాభిరాముడి పవిత్రోత్సవాలు
ABN , First Publish Date - 2021-10-18T06:05:14+05:30 IST
వాల్మీకిపురంలో వెలసిన పట్టాభిరామాలయ పవిత్రోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి.
వాల్మీకిపురం, అక్టోబరు 17: పట్టణంలో వెలసిన పట్టాభిరామాలయ పవిత్రోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారి కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం ఉదయం ఆలయ మండపంలో హోమాలు, పవిత్రాల ప్రతిష్ట, స్నపన తిరుమంజనం, బుధవారం స్నపన తిరుమంజనం, హోమం, పవిత్రాల సమర్పణ, గురువారం ఉదయం హోమం, స్నపన తిరుమంజనం, చక్రస్నానం, సాయంత్రం పవిత్రాల విసర్జనతో ఉత్సవాలు ముగియనున్నట్లు చెప్పారు. కొవిడ్ నిబంధనల అమలుతో ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన గుర్తుచేశారు.