పట్టణాభివృద్ధికి కృషి చేయాలి
ABN , First Publish Date - 2021-04-21T05:38:36+05:30 IST
మార్కాపురం మున్సిపల్ నూతన పాలకవర్గం పట్టణాభివృద్ధికి కృషి చేయాలని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు.
మార్కాపురం (వన్టౌన్) ఏప్రిల్ 6: మార్కాపురం మున్సిపల్ నూతన పాలకవర్గం పట్టణాభివృద్ధికి కృషి చేయాలని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో సోమవారం రాత్రి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణ ఆర్యవైశ్య కౌన్సిలర్లకు సన్మాన కా ర్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్లు చాటకొండ చంద్రశేఖర్, కశెట్టి నగేష్, కొత్త కృష్ణ, వక్కలగడ్డ రంగస్వాతి, భుశెట్టి నాగేశ్వరరావు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ బొగ్గరపు శేషయ్య తదితరులను సన్మానించారు. కార్యక్రమం లో ఆర్యవైశ్య సంఘ సభ్యులు వక్కలగడ్డ మల్లికార్జునరావు, కార్యదర్శి పి. నారాయణ, కోశాధికారి సుధీర్, సభ్యులు పాల్గొన్నారు.