కరోనా నుంచి కోలుకున్న పవన్

ABN , First Publish Date - 2021-05-08T18:44:40+05:30 IST

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.

కరోనా నుంచి కోలుకున్న పవన్

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. కరోనా బారినపడిన పవన్‌కు ప్రత్యేక వైద్య సేవలు అందించిన డాక్టర్లు మూడు రోజుల కిందట ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. నెగిటివ్ వచ్చిందని ప్రకటనలో వెల్లడించారు. అయితే కరోనా అనంతరం వచ్చే నిస్త్రాణం వంటివి మాత్రం ఉన్నాయని తెలిపారు. తన ఆరోగ్య క్షేమాల కోసం ఆకాంక్షించిన వారికి, పూజలు, ప్రార్థనలు చేసిన జనసైనికులు, నాయకులు, అభిమానులకు పవన్ కల్యాణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉన్నందున ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, వైద్య నిపుణులు అందిస్తున్న సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-05-08T18:44:40+05:30 IST