రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఉమ్మడి కార్యాచరణ : పవన్
ABN , First Publish Date - 2020-08-08T02:12:40+05:30 IST
రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసికట్టుగా ముందుకు వెళతాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇందుకోసం అవసరమైన ఉమ్మడి కార్యాచరణను
అమరావతి: రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసికట్టుగా ముందుకు వెళతాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇందుకోసం అవసరమైన ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకుని అడుగులు వేస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు పవన్ను కలిశారు. వీరి భేటీ అనంతరం పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ భేటీలో పలు అంశాలపై కలిసి పని చేయడం గురించి మాట్లాడుకున్నామని చెప్పారు. అమరావతిలోని రైతుల సమస్య, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చర్చించడం జరిగిందన్నారు. నేడు తమ మధ్య ప్రస్తావనకు వచ్చిన అంశాలపై మరింత కూలంకషంగా చర్చిస్తామని పవన్ పేర్కొన్నారు. తమ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర సభ్యులు, బీజేపీ సభ్యులతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తామని పవన్ తెలిపారు.