గండికోట బాధితులను ఆదుకోండి: పవన్ కల్యాణ్

ABN , First Publish Date - 2020-09-26T20:11:44+05:30 IST

అమరావతి: గండికోట రిజర్వాయర్ ముంపు పరిధిలో ఉన్న తాళ్ళ ప్రొద్దుటూరు గ్రామస్తులను వరద నీటి నుంచి కాపాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు.

గండికోట బాధితులను ఆదుకోండి: పవన్ కల్యాణ్

అమరావతి: గండికోట రిజర్వాయర్ ముంపు పరిధిలో ఉన్న తాళ్ళ ప్రొద్దుటూరు గ్రామస్తులను వరద నీటి నుంచి కాపాడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. తమకు ఇంకా పరిహారం కూడా అందనందున తాము ఇక్కడే ఉండిపోయామని కాలనీవాసులు చెబుతున్నారన్నారు. వేరేచోట ఇల్లు అద్దెకు తీసుకునే ఆర్థిక స్థోమత వారికి లేదని పవన్ పేర్కొన్నారు.


వృద్ధులు, చంటి పిల్లలు, చివరికి గర్భిణీలు సైతం వరద నీటిలో చిక్కుకున్నారన్నారు. రిజర్వాయర్‌‌లోకి  నీటి విడుదలపై సంయమనం పాటించాలన్నారు. నిర్వాసితులను బలవంతంగా కాకుండా వారు ఇష్టపూర్వకంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వాసితులతో అధికారులు తక్షణం సంప్రదింపులు జరిపి వారి అభీష్టాన్ని నెరవేర్చాలన్నారు. తాళ్ళప్రొద్దుటూరు వాసుల ప్రాణాలు రక్షించమని కోరుతున్నానని పవన్ పేర్కొన్నారు.


Updated Date - 2020-09-26T20:11:44+05:30 IST