రాష్ట్రంలో మహిళల మానప్రాణాలకు రక్షణ లేదు: పవన్ కల్యాణ్
ABN , First Publish Date - 2020-08-04T20:47:10+05:30 IST
రాష్ట్రంలో దిశచట్టం, దిశ స్టేషన్లపై ప్రచారమే తప్ప మహిళలపై దాష్టీకాలు తగ్గలేదని..
అమరావతి: రాష్ట్రంలో దిశచట్టం, దిశ స్టేషన్లపై ప్రచారమే తప్ప మహిళలపై దాష్టీకాలు తగ్గలేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. గిరిజనులపై దాష్టీకాలకు పాల్పడుతున్న వారిపై..చర్యలు తీసుకొనేందుకు పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళల మానప్రాణాలకు రక్షణ లేదన్నారు. గిరిజన మహిళ మంత్రూభాయిని అధికార పార్టీకి చెందిన ఓ వడ్డీ వ్యాపారి..ట్రాక్టర్తో తొక్కించి హత్య చేయడం అమానవీయమని పవన్ కల్యాణ్ అన్నారు.