పవన్ ఆదేశం మేరకే తిరుపతిలో ప్రచారం: నాదెండ్ల
ABN , First Publish Date - 2021-03-29T00:58:31+05:30 IST
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఆదేశం మేరకే ప్రచారం నిర్వహిస్తామని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
తిరుపతి: జనసేన అధినేత పవన్కల్యాణ్ ఆదేశం మేరకే ప్రచారం నిర్వహిస్తామని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. వారం రోజుల్లో పవన్ కూడా ప్రచారానికి వస్తారని తెలిపారు. రేణిగుంట ఎయిర్పోర్టులో నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుపతి ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ఎంపిక చేశారని తెలిపారు. సీఎం జగన్ రోజూ రూ.500 కోట్ల అప్పు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఆయన అనుచరులు సొంత వ్యాపారాలపై దృష్టి సారించి పరిపాలనను గాలికొదిలారని మనోహర్ తప్పుబట్టారు.