అమర జవాన్ కు పవన్ నివాళి
ABN , First Publish Date - 2020-07-08T08:47:50+05:30 IST
జమ్మూకశ్మీర్లో జరిగిన తీవ్రవాదుల దాడిలో తెలంగాణ బిడ్డ సాలిగం శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోవడం ఎంతో దురదృష్టకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): జమ్మూకశ్మీర్లో జరిగిన తీవ్రవాదుల దాడిలో తెలంగాణ బిడ్డ సాలిగం శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోవడం ఎంతో దురదృష్టకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అమర జవాన్ శ్రీనివా్సకు పవన్ నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతో్షబాబు కుటుంబాన్ని ఆదుకున్న రీతిలోనే శ్రీనివాస్ కుటుంబానికి కూడా అండగా నిలవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను పవన్ కోరారు.