ఉపాధి బిల్లులు చెల్లించండి

ABN , First Publish Date - 2021-08-03T08:16:07+05:30 IST

ఉపాధి హామీ బిల్లుల పెండింగ్‌పై టీడీపీ నేతలు మరోసారి గళమెత్తారు.

ఉపాధి బిల్లులు చెల్లించండి

  • రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు
  • పలు ప్రాంతాల్లో ర్యాలీలు, ధర్నాలతో నిరసనలు

అమరావతి, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ బిల్లుల పెండింగ్‌పై టీడీపీ నేతలు మరోసారి గళమెత్తారు. ఉపాధి బిల్లుల విడుదలలో కోర్టు ఆదేశాలను లెక్క చేయడకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు జరిగాయి. 175నియోజకవర్గ కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల వద్ద టీడీపీ శ్రేణులు ప్రదర్శనలు నిర్వహించాయి. కొన్ని చోట్ల ర్యాలీలు జరిపారు. టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ఉపాధి బిల్లులు రాని కాంట్రాక్టర్లు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోర్టు ఆదేశాలను అనుసరించి, రూ.2,500కోట్ల పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఉపాధి హామీ చట్ట ప్రకారం 12 శాతం వడ్డీతో సహా చెల్లింపులు జరపాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-08-03T08:16:07+05:30 IST