జీతాలు చెల్లింపు
ABN , First Publish Date - 2020-05-28T09:31:09+05:30 IST
పార్వతీపురం ఏరియా ఆసు పత్రిలో పనిచేస్తున్న 11 మంది స్ట్రచర్ బోయ్స్, గర్ల్స్, కం ప్యూటర్ ఆపరేటర్లకు ఐటీడీఏ ద్వారా వేతనాలు
పార్వతీపురం, మే 27: పార్వతీపురం ఏరియా ఆసు పత్రిలో పనిచేస్తున్న 11 మంది స్ట్రచర్ బోయ్స్, గర్ల్స్, కం ప్యూటర్ ఆపరేటర్లకు ఐటీడీఏ ద్వారా వేతనాలు చెల్లింపు చేపట్టారు. గత 11 నెలలుగా జీతాలు లేక అనేక ఇబ్బం దులు పడుతున్న వీరి సమస్యలను ఐటీడీఏ పీవో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దృష్టికి సిబ్బంది తీసుకువెళ్లారు. సమ స్యపై పీవో స్పందించి 11 నెలల జీతాలు విడుదలకు సం బంధించి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం రూ. 7.20 లక్షలు విడుదల చేశారు. వెంటనే చిరుద్యోగులకు జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎం అండ్హెచ్వో డాక్టర్ రవికుమార్రెడ్డికి ఆదేశించారు.