పేటీఎం ఉద్యోగికి కరోనా.. 15 రోజులపాటు కార్యాలయం మూత!

ABN , First Publish Date - 2020-03-06T02:34:11+05:30 IST

ఆన్‌లైన్ పేమెంట్ యాప్ పేటీఎం గురుగ్రామ్‌లోని తన కార్యాలయాన్ని 15 రోజులపాటు మూసివేస్తున్నట్టు ప్రకటించింది

పేటీఎం ఉద్యోగికి కరోనా.. 15 రోజులపాటు కార్యాలయం మూత!

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ పేమెంట్ యాప్ పేటీఎం గురుగ్రామ్‌లోని తన కార్యాలయాన్ని 15 రోజులపాటు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. తమ ఉద్యోగుల్లో ఒకరికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో మరింత మందికి అది సోకకుండా ఉండేందుకు కార్యాలయాన్ని మూసివేస్టున్నట్టు పేర్కొంది. విహారయాత్రకు ఇటలీకి వెళ్లి వచ్చిన తమ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్టు పరీక్షల్లో తేలిందని పేటీఎం తెలిపింది. దీంతో అది మరింత విస్తరించకుండా ఉండేందుకు కార్యాలయానికి సెలవులు ప్రకటించింది. అంతేకాదు.. వచ్చే రెండు రోజులపాటు ఇంటి నుంచి పనిచేయాల్సిందిగా ఉద్యోగులను కోరింది. ఉద్యోగుల్లో ఎవరికైనా వైద్య సాయం కావాలంటే వెంటనే తమను సంప్రదించాలని సూచించింది.

Updated Date - 2020-03-06T02:34:11+05:30 IST