ఎన్డీయేను వీడనున్న కేరళ కాంగ్రెస్.. పీసీ థామస్ వర్గం
ABN , First Publish Date - 2020-10-25T17:45:33+05:30 IST
ఎన్డీయే కూటమిని వీడేందుకు కేరళ కాంగ్రెస్లోని పీసీ థామస్ వర్గం అడుగులు వేస్తోంది...
ఎన్డీయే కూటమిని వీడేందుకు కేరళ కాంగ్రెస్లోని పీసీ థామస్ వర్గం అడుగులు వేస్తోంది. అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పీసీ థామస్ మీడీయాతో మాట్లాడుతూ బీజేపీ చేసిన వాగ్దానాలన్నీ ఏవీ పూర్తిచేయలేదని అందుకే కూటమి నుంచి వైదొలగేందుకు ఆలోచిస్తున్తామని చెప్పారు. తమ పార్టీ అమిత్ షాతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కేంద్రంలో కేరళ కాంగ్రెస్ సభ్యులకు ఆశించిన పదవులేవి ఇంతవరకు లభించలేదని థామస్ అన్నారు.