కేసీఆర్ దళిత ద్రోహి: మాజీ మంత్రి పొన్నాల
ABN , First Publish Date - 2021-06-29T21:45:03+05:30 IST
సీఎం కేసీఆర్పై పీసీసీ మాజీ అధ్యక్షడు పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏడేళ్ల
హైదరాబాద్: సీఎం కేసీఆర్పై పీసీసీ మాజీ అధ్యక్షడు పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏడేళ్ల తర్వాత కేసీఆర్కు దళిత సాధికారత గుర్తుకు వచ్చిందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి దళిత్ ఎంపవర్మెంట్ పథకాన్ని తెరపైకి తెచ్చాడని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఒక దళిత ద్రోహి అని ఆయన మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ను తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని ఆయన స్పష్టం చేశారు. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని పొన్నాల డిమాండ్ చేశారు.
సమయం ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తే 43 వేల ఉద్యోగాలు దళితులకు వచ్చేవని ఆయన పేర్కొన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి లాగానే, సీఎం ఎంపవర్మెంట్ పథకం కూడా ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. దళితుల హత్యలు, వారిపై దాడులు చేసినవారి మీద చర్యలు ఏవని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం కేసీఆర్ కొత్త నాటకాలు ఆడుతున్నారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు.