ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్‌

ABN , First Publish Date - 2020-05-28T09:28:10+05:30 IST

వివిధ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన మహారాష్ట్ర గుమన్‌/ చెడ్డీ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు, ఆర్టీసీ బస్సులో చోరీలు చేస్తున్న

ముగ్గురు నిందితులపై పీడీ యాక్ట్‌

హైదరాబాద్‌ సిటీ, మే 27 (ఆంధ్రజ్యోతి): వివిధ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన మహారాష్ట్ర గుమన్‌/ చెడ్డీ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు, ఆర్టీసీ బస్సులో చోరీలు చేస్తున్న నిందితుడిపై రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌, హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. మహారాష్ట్ర, అకోలా జిల్లా, కిడికీ ప్రాంతానికి చెందిన సాధిక్‌, సాజిద్‌ చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులు. వీరు పలు రాష్ట్రాల్లో చోరీలు చేశారు. చెడ్డీ గ్యాంగ్‌ గతేడాది డిసెంబర్‌లో హయత్‌నగర్‌ పోలీసులకు పట్టుబడ్డారు.

  

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల నగలు చోరీ చేస్తున్న మల్లేపల్లి అఫ్జల్‌సాగర్‌కు చెందిన కేఎస్‌ ధరమ్‌పై హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ పీడీయాక్ట్‌ నమోదు చేశారు. ఇతడిపై 25 కేసులు నమోదు అయ్యాయి. జైలుకెళ్లొచ్చినా అతడిలో మార్పు రాలేదు.

Updated Date - 2020-05-28T09:28:10+05:30 IST