2500 కేజీల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-12-04T04:38:18+05:30 IST

రేషన్‌ డిపో నుంచి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు టూటౌన్‌ ఎస్‌ఐ రాంబాబు తెలిపారు.

2500 కేజీల రేషన్‌ బియ్యం పట్టివేత

భీమవరం క్రైం, డిసెంబరు 3 : రేషన్‌ డిపో నుంచి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు టూటౌన్‌ ఎస్‌ఐ రాంబాబు తెలిపారు. శివరావు పేటలో బండి కృష్ణవేణి రేషన్‌ డిపో (29వ నెంబర్‌) నుంచి బుధవారం రాత్రి ముగ్గురు బొలేరో వాహనంలో 50 బస్తాలు (2500 కేజీలు) బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో ఎస్‌ఐ రాంబాబు వారిని వెంబడించి బైపాస్‌ రోడ్‌లో అడ్డుకున్నారు. గ్రంధి రాము, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని బియ్యాన్ని సివిల్‌ సప్లై అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-12-04T04:38:18+05:30 IST