పీడీఎస్ బియ్యం స్వాధీనం
ABN , First Publish Date - 2021-10-17T06:44:14+05:30 IST
ముక్తేశ్వరం నుంచి యానాం అక్రమంగా తరలిస్తున్న 14టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముమ్మిడివరం, అక్టోబరు 16: ముక్తేశ్వరం నుంచి యానాం అక్రమంగా తరలిస్తున్న 14టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముమ్మిడివరం సీఐ ఎం.జానకీరామ్కు సమాచారం అందడంతో ఎస్ఐ కె.సురేష్బాబు ఆధ్వర్యంలో పోలీసులు ఆ లారీని అదుపులోకి తీసుకుని బియ్యాన్ని సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.