భక్తిభావంతో మానసిక ప్రశాంతత

ABN , First Publish Date - 2021-10-22T05:17:06+05:30 IST

ప్రజల్లో భక్తిభావం పెంపొందినప్పుడే మానసిక ప్రశాంతత నెలకొంటుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి అన్నారు.

భక్తిభావంతో మానసిక ప్రశాంతత
దుర్గామాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి

హత్నూర, అక్టోబరు 21 : ప్రజల్లో భక్తిభావం పెంపొందినప్పుడే మానసిక ప్రశాంతత నెలకొంటుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి అన్నారు. గురువారం హత్నూర మండలం దౌల్తాబాద్‌లో నూతనంగా నిర్మించిన దుర్గాభవానీ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డిని ఆలయ నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటేశం, ఎంపీటీసీ ఇందిరాసతీష్‌, ఆలయ నిర్వాహకులు కల్వ శ్రీనివాస్‌ ఉన్నారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనలో భాగంగా సాయంత్రం మహిళలు బోనాల ఊరేగింపు నిర్వహించారు. 

Updated Date - 2021-10-22T05:17:06+05:30 IST