శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదు

ABN , First Publish Date - 2021-10-24T06:10:16+05:30 IST

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కఠిన చర్యలు చేపట్టాలని అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ ఆదేశించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదు
కశింకోట జంక్షన్‌లో ట్రాఫిక్‌ను పరిశీలిస్తున్న డీఎస్పీ

అనకాపల్లి డీఎస్పీ సునీల్‌


కశింకోట, అక్టోబరు 23: శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కఠిన చర్యలు చేపట్టాలని అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ ఆదేశించారు. మండలంలోని కశింకోట, బయ్యవరం, తాళ్లపాలెం, నర్సింగబిల్లి, పల్లపుసోమవరం, నూతనగుంటపాలెం గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రజలు ఐక్యతాభావంతో ముందుకు సాగాలన్నారు. రాజకీయ విభేదాలు, కక్షలు విడనాడాలని సూచించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పారు. గ్రామాల్లో ప్రజలు అల్లర్లకు దిగకుండా చైతన్యవంతుల్ని చేయాలని పోలీసులను ఆదేశించారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో రూరల్‌ సీఐ జి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ ఎల్‌.సురేశ్‌కుమార్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-10-24T06:10:16+05:30 IST