యూపీలో శాంతి భద్రతలు భేష్: అమిత్ షా
ABN , First Publish Date - 2021-08-02T07:11:57+05:30 IST
మరో ఆర్నెల్లలో అసెంబ్లీ ఎన్నికలున్న వేళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు.
లఖ్నవూ, ఆగస్టు 1: మరో ఆర్నెల్లలో అసెంబ్లీ ఎన్నికలున్న వేళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. శాంతి భద్రతల విషయంలో యూపీని అగ్రభాగాన నిలిపారని కొనియాడారు. యూపీలో అమిత్ షా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. యూపీలో ఎన్నడూ లేని అభివృద్ధి ఈ ఐదేళ్లలో జరిగిందని, ఒకప్పటి భయానక వాతావరణం ఇప్పుడు లేదని అన్నారు. యూపీ 44 అభివృద్ధి పథకాలతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఇందుకు సీఎం యోగి కృషే కారణమని అమిత్ షా ప్రశంసించారు.