వేరుశనగ రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-09-29T06:00:06+05:30 IST

మండలంలోని రామనపల్లి గ్రామం వద్ద టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మంగళవారం మొక్కజొన్న, వేరుశనగ పంటలను పరిశీలించారు.

వేరుశనగ రైతులను ఆదుకోవాలి
వేరుశనగ పంటను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్సీ

అగళి, సెప్టెంబరు 28: మండలంలోని రామనపల్లి గ్రామం వద్ద టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మంగళవారం మొక్కజొన్న, వేరుశనగ పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంటలు పెట్టి తీవ్రంగా నష్టపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఇనపుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స ఇచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కోరారు. అనంతరం పి.బ్యాడిగెర, హెచడి.హళ్లి గ్రామాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈయన వెంట జడ్పీటీసీ ఉమేష్‌, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 



Updated Date - 2021-09-29T06:00:06+05:30 IST