గొంతులో బఠాణి గింజ ఇరుక్కుని మృతి
ABN , First Publish Date - 2021-09-17T22:30:24+05:30 IST
గొంతులో బఠాణి గింజ ఇరుక్కుని బాలుడు
నెల్లూరు: గొంతులో బఠాణి గింజ ఇరుక్కుని బాలుడు మృతి చెందాడు. ఉదయగిరి మండలం కుర్రపల్లి బీసీ కాలనీ కిరణ్ అనే రెండేళ్ల బాలుడి గొంతులో బఠాణి గింజ ఇరుక్కుంది. అయితే ఎంత ప్రయత్నించినా గొంతు నుంచి బఠాణి గింజ బయటకు రాలేదు. గొంతులో బఠాణి గింజ ఉండడంతో శ్వాస ఆడక బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.