పెంచిన జరిమానాలు తగ్గించాలి
ABN , First Publish Date - 2020-10-25T11:09:54+05:30 IST
మోటారు వాహనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన అపరాధ రుసుములు, జరిమానాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో..
పెదపాడు : మోటారు వాహనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన అపరాధ రుసుములు, జరిమానాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో పెదపాడు బస్టాండ్ సెంటర్లో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో సర్వీసులు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, ఇటువంటి పరిస్థితుల్లో జరిమానాలు పెంచడం దారుణమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, అల్లూరి సీతారామరాజు ఆటోయూనియన్ నాయకులు పాల్గొన్నారు.