పేదరికం నిర్మూలనకు పలు పథకాలు

ABN , First Publish Date - 2021-10-15T03:18:37+05:30 IST

పేదరిక నిర్మూలన దిశగా పొదుపు మహిళలందరికీ ఆర్ధిక స్వాలంబన చేకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకా

పేదరికం నిర్మూలనకు పలు పథకాలు
సమావేశంలో పాల్గొన్న అధికారులు. స్రజాప్రతినిధులు

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

ఆత్మకూరు, అక్టోబరు 14 : పేదరిక నిర్మూలన దిశగా పొదుపు మహిళలందరికీ ఆర్ధిక స్వాలంబన చేకూర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి తెచ్చిందని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ జి వెంకటరమణమ్మ, కమిషనర్‌ ఎం రమేష్‌బాబు పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో గురువారం ఆసరా రెండవ విడత సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయం సాధించాలనుకున్న మహిళ తన స్వయంకృషిపై అత్యంత ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలన్నారు. మెప్మా సీఎంఎం భాస్కర్‌, సీసీ మాధవి మాట్లాడుతూ ఆత్మకూరు మున్సిపాలిటీలో పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ(మెప్మా) పరిధిలోని 439 పొదుపు గ్రూపుల్లో ఉన్న 4195 మంది మహిళలు రెండవ విడత ఆసరా పథకం కింద రూ. 3,62,88,395 లబ్ధిపొందుతుండ డం హర్షదాయకమన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ షేక్‌ సర్ధార్‌  ఎంపీపీ కేతా వేణుగోపాల్‌రెడ్డి, సిండికేట్‌ ఫార్మర్స్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు జి లక్ష్మీ, కార్యదర్శి కె వెంకటరమణమ్మ, కోశాధికారి ఏ పెంచలమ్మ, ఉపాధ్యక్షురాలు ప్రమీల తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-15T03:18:37+05:30 IST