సింగరేణిలో రెండవ రోజు కొనసాగుతున్న సమ్మె

ABN , First Publish Date - 2021-12-10T13:03:17+05:30 IST

సింగరేణిలో కార్మికుల సమ్మె రెండవరోజు కొనసాగుతోంది.

సింగరేణిలో రెండవ రోజు కొనసాగుతున్న సమ్మె

పెద్దపల్లి: సింగరేణిలో కార్మికుల సమ్మె రెండవరోజు కొనసాగుతోంది. కార్మికులు విధులకు హజరుకాకపోవడంతో గనులు బోసిపోతున్నాయి. సమ్మె కారణంగా నాలుగు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. 40 కోట్ల రూపాయలు కార్మికుల వేతనాలకు నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో కార్మిక సంఘాల నాయకులను ఆర్ఎల్‌సి చర్చలకు ఆహ్వనించింది. కాగా కార్మిక సంఘాల డిమాండ్లను యాజమాన్యం అంగీకరించకపోవడంతో కార్మికులు తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. 

Updated Date - 2021-12-10T13:03:17+05:30 IST