సంక్షేమ పథకాలపై పెద్దాపురం ఆర్డీవో సమీక్ష

ABN , First Publish Date - 2021-10-24T05:14:06+05:30 IST

పెద్దాపురం, అక్టోబరు 23: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పెద్దాపురం ఆర్డీవో పి.వెంకటరమణ శనివారం తహశీల్దార్లతో వర్చువల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలు, రెవెన్యూ పరమైన అంశాలపై తహశీల్దార్లకు దిశా నిర్దేశం చేశారు. డివిజన్‌ పరిధిలోని వార్డు సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాలు డిజిటల్‌ లైబ్రేరీ తదితర అంశాలపై సమీక్షించారు. శా

సంక్షేమ పథకాలపై పెద్దాపురం ఆర్డీవో సమీక్ష
వర్చువల్‌ కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న ఆర్డీవో

పెద్దాపురం, అక్టోబరు 23: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పెద్దాపురం ఆర్డీవో పి.వెంకటరమణ శనివారం తహశీల్దార్లతో వర్చువల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలు, రెవెన్యూ పరమైన అంశాలపై తహశీల్దార్లకు దిశా నిర్దేశం చేశారు. డివిజన్‌ పరిధిలోని వార్డు సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాలు డిజిటల్‌ లైబ్రేరీ తదితర అంశాలపై సమీక్షించారు. శాశ్వత భవన నిర్మాణాలకు స్థల పరిశీలన చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పలు విషయాలపై ఆర్డీవో చర్చించారు. సమావేశంలో కార్యాలయ డీటీ రామ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T05:14:06+05:30 IST