21 మంది రౌడీషీటర్లపై పీడీయాక్ట్ నమోదు

ABN , First Publish Date - 2021-07-19T23:00:14+05:30 IST

గడిచిన ఆరు నెలల్లో 21 మంది రౌడీషీటర్లపై పీడీయాక్ట్ నమోదు చేశామని సైబారాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

21 మంది రౌడీషీటర్లపై పీడీయాక్ట్ నమోదు

హైదరాబాద్‌: గడిచిన ఆరు నెలల్లో 21 మంది రౌడీషీటర్లపై పీడీయాక్ట్ నమోదు చేశామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. సోమవారం అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 17న జరిగిన రౌడీషీటర్ సయ్యద్ ముస్తాక్ హత్య కేసులో నిందితుడు మహ్మద్ బిన్ అల్విని సహా మరో నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. పాతకక్ష్యలే ఈ హత్యకు కారణమని అంజనీ కుమార్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-19T23:00:14+05:30 IST