పీవీ ప్రపంచస్థాయి నాయకుడు: కేకే

ABN , First Publish Date - 2021-04-11T08:32:37+05:30 IST

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రపంచ స్థాయి నాయకుడని రాజ్యసభ సభ్యుడు, పీవీ శతజయంతి ఉత్సవకమిటీ చైర్మన్‌ డాక్టర్‌ కే.కేశవరావు అన్నారు.

పీవీ ప్రపంచస్థాయి నాయకుడు: కేకే

హైదరాబాద్‌,  ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రపంచ స్థాయి నాయకుడని రాజ్యసభ సభ్యుడు, పీవీ శతజయంతి ఉత్సవకమిటీ చైర్మన్‌ డాక్టర్‌ కే.కేశవరావు అన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలను మారిష్‌సలో.. ఆన్‌లైన్‌ ద్వారా ఆయన ప్రారంభించారు. విదేశీ విధానాల్లో పీవీ అనుసరించిన లుక్‌ఈస్ట్‌ పాలసీ ఫలాలు నేడు అందుతున్నాయని చెప్పారు. పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభివాణీదేవీ మాట్లాడుతూ.. పీవీ తన విద్వత్తుతోనే రాజకీయ రంగంలో విజయం సాధించారన్నారు. రాజీయాల్లోకి రావాలనుకునే యువతరానికి పీవీ మార్గదర్శి అని చెప్పారు. 

Updated Date - 2021-04-11T08:32:37+05:30 IST