పేకాట స్థావరంపై దాడి
ABN , First Publish Date - 2021-10-21T04:39:21+05:30 IST
బుచ్చిరెడ్డిపాళెంలోని ఓ వైసీపీ నాయకుడి ఇంట్లో పేకాట ఆడుతున్న స్థావరంపై స్థానికుల సమాచారం మేరకు మంగళవారం అర్ధరాత్రి సెబ్ అధికారులు, బుచ్చి సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ ప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో దాడిచేసి 18మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.
సెబ్, పోలీసుల అదుపులో 18మంది పేకాట రాయుళ్లు
7 బైక్లు, సెల్ఫోన్లు, రూ.1.92లక్షల స్వాధీనం
బుచ్చిరెడ్డిపాళెం, అక్టోబరు 20: బుచ్చిరెడ్డిపాళెంలోని ఓ వైసీపీ నాయకుడి ఇంట్లో పేకాట ఆడుతున్న స్థావరంపై స్థానికుల సమాచారం మేరకు మంగళవారం అర్ధరాత్రి సెబ్ అధికారులు, బుచ్చి సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ ప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో దాడిచేసి 18మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి రూ.లక్షా 92వేల నగదు, 7 బైక్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ హరనాథ్రెడ్డి తెలిపారు. బుచ్చిరెడ్డిపాళెంలోని పెద్దూరులో మేనకూరు సీతారామిరెడ్డికి చెందిన ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. గత కొన్నేళ్లుగా ఈ తంతు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.