పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ABN , First Publish Date - 2022-01-21T03:59:11+05:30 IST
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు రావాల్సిన మూడు నెలల పెం డింగ్ వేతనాలను చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సంకె రవి పేర్కొ న్నారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కార్మికులతో కలిసి నిరసన తెలి పారు.
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 20: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు రావాల్సిన మూడు నెలల పెం డింగ్ వేతనాలను చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సంకె రవి పేర్కొ న్నారు. గురువారం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కార్మికులతో కలిసి నిరసన తెలి పారు. ఆయన మాట్లాడుతూ మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు, సెక్యూరిటీ గార్డుల కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయని పేర్కొన్నారు. రెండు రోజుల్లో వేతనాలు చెల్లించకుంటే విధులు బహిష్కరి స్తామని తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు దాసరి రాజేశ్వరి, నాయ కులు కుమార్, చంద్రయ్య, విమల, లక్ష్మీ, నరేష్, శంకరమ్మ పాల్గొన్నారు.