పెండింగ్‌ పనులను వేగవంతంగా పూర్తి చెయ్యాలి

ABN , First Publish Date - 2020-05-24T10:57:45+05:30 IST

జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చెయాలని జిల్లా కలెక్టర్‌ గుగులోత్‌ రవి అన్నారు.

పెండింగ్‌ పనులను వేగవంతంగా పూర్తి చెయ్యాలి

కలెక్టర్‌ గుగులోత్‌ రవి


ఆంద్రజ్యోతి జగిత్యాల, మే 23: జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చెయాలని జిల్లా కలెక్టర్‌ గుగులోత్‌ రవి అన్నారు. శనివారం జిల్లాలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్‌ రవి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల కార్యాలయాలలో పెండింగ్‌లో ఉన్న శాఖపరమైన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా కలెక్టర్‌ రవి అధికారులకు పనులపై దిశా నిర్ధేశం చేశారు. జిల్లాలో గత సంవత్సరం ఉపాధి హామీలో పని చేసి ఈ సంవత్సరం రాని వారు ఎంత మంది ఉన్నారో గుర్తించి వారు ఏ కారణం చేత పనులకు రావడంలేదో తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుండి జిల్లకు వచ్చిన వారిని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం హోం క్వారంటైన్‌లో ఉంచడం జరుగుతుందని హోం క్వారంటైన్‌లో ఉండని వారిపై కోవిడ్‌-19 నిబంధనలను పాటించని వారిపై కేసు నమోదు చేసి వారిని వెంటనే ప్రభుత్వ క్వారెంటైన్‌కు పంపాలని అన్నారు.


జిల్లా అధికారులు కోవిడ్‌ - 19 నిబంధనలను కచ్చితంగా నిఖచితంగా పాటించాలని ఆదేశాలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్‌ రాజేశం, అడిషనల్‌ ఎస్పీ దక్షణమూర్తి, డీఆర్వో అరుణశ్రీ,  డీఎస్పీలు ప్రతాప్‌, వెంకటరమణ, ఆర్టీఓ నరేంధర్‌లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-24T10:57:45+05:30 IST