పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-05-16T10:09:55+05:30 IST
జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9,10,11,12 పెండింగ్ పనులతోపాటు డిస్ట్రిబ్యూషన్ కాలువల నిర్మాణ
కలెక్టర్ కృష్ణభాస్కర్
సిరిసిల్ల కలెక్టరేట్, మే 15: జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9,10,11,12 పెండింగ్ పనులతోపాటు డిస్ట్రిబ్యూషన్ కాలువల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశిం చారు. కలెక్టరేట్లో శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణపనులపై ఇంజ నీరింగ్, వ్యవసాయశాఖ, ఉద్యాన, భూగర్భజల శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యలుంటే తన దృష్టికి తీసుకోనిరావాలని సూచించారు. వానాకాలం సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని వ్యవ సా య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సీజన్లో సన్నరకాలు సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించాలని, డీఏపీ, కాం ప్లెక్స్ ఎరువులను వర్షాలు రాకముందే స్టోరేజ్ పాయింట్లలో నిల్వ చేసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ అంజయ్య, వ్యవసాయ జిల్లా అధికారి రణధీర్రెడ్డి, ఉద్యాన జిల్లా అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.