పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌కు చేదు అనుభవం

ABN , First Publish Date - 2020-11-22T15:31:56+05:30 IST

విశాఖ పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది.

పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌కు చేదు అనుభవం

విశాఖపట్నం: విశాఖ పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. 77 వార్డ్ అభ్యర్థి బొట్టు సన్యాసిరావు మృతదేహన్ని చూడటానికి వచ్చిన పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజును బంధువులు అడ్డుకున్నారు. పెదగంట్యాడ మండలం 77 వవార్డు అభ్యర్ది బొట్టు సన్యాసిరావు అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే రాజకీయ కారణాల ఒత్తిడి కారణగానే సన్యాసిరావు మృతి చెందాడని  కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే అక్కడకు వచ్చిన ఎమ్మెల్యేను బంధువులు అడ్డుకున్నారు. 


Updated Date - 2020-11-22T15:31:56+05:30 IST