ఏప్రిల్‌ నుంచి ‘సరళ్‌’ పెన్షన్‌ పథకం

ABN , First Publish Date - 2021-01-26T07:01:07+05:30 IST

భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వ్యక్తిగత ప్రామాణిక యాన్యుటీ బీమా పథకానికి ఆమోద ముద్ర వేసింది

ఏప్రిల్‌ నుంచి ‘సరళ్‌’ పెన్షన్‌ పథకం

న్యూఢిల్లీ: భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త వ్యక్తిగత ప్రామాణిక యాన్యుటీ బీమా పథకానికి ఆమోద ముద్ర వేసింది. అన్ని జీవిత బీమా సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే ఈ పథకం ప్రారంభించాలని ఆదేశించింది. ఈ పథకానికి ముందు కంపెనీ పేరు చేర్చి ‘సరళ్‌’ యాన్యుటీ పథ కం ప్రారంభించాలని కోరింది. ఈ పథకంలో రెండు ఆప్షన్లు మాత్రమే ఉంటాయి. అందులో ఒకటి లైఫ్‌ యాన్యుటీ, రెండోది జాయింట్‌ లైఫ్‌ యాన్యుటీ. ఇందులో లైఫ్‌ యాన్యు టీ ఆప్షన్‌ కింద కొనుగోలు ధర పూర్తిగా చెల్లిస్తారు. జాయిం ట్‌ లైఫ్‌ యాన్యుటీ కింద మొదటి పాలసీదారుడి మరణం తర్వాత రెండో యాన్యుటీదారుడికి నూరు శాతం యాన్యుటీతో పాటు పాలసీ  కొనుగోలు ధర మొత్తాన్ని చెల్లిస్తారు 


ఈ పథకం కింద మెట్యూరిటీ ప్రయోజనాలు ఉండవు

పాలసీ అమలైన ఆరు నెలల్లోపు పాలసీదారుడు లేదా అతడి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా తీవ్ర అనారోగ్యం తలెత్తితే పాలసీని ఎప్పుడైనా సరెండర్‌ చేయవచ్చు

కనీస నెలవారీ యాన్యుటీ రూ.1,000

యాన్యుటీ గరిష్ఠ చెల్లింపులపై పరిమితులు

పాలసీ ప్రీమియం నిర్ణయంపై కంపెనీల ఇష్టం

Updated Date - 2021-01-26T07:01:07+05:30 IST