కేసీఆర్‌ మాయ మాటలను నమ్మె పరిస్థితుల్లో ప్రజలు లేరు

ABN , First Publish Date - 2021-10-17T05:06:05+05:30 IST

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్‌ మాయ మాటలను నమ్మె పరిస్థితుల్లో ప్రజలు లేరని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

కేసీఆర్‌ మాయ మాటలను నమ్మె పరిస్థితుల్లో ప్రజలు లేరు
హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సీతక్క

ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించిన చరిత్ర కేసీఆర్‌ది

ములుగు ఎమ్మెల్యే సీతక్క

హుజూరాబాద్‌, అక్టోబరు 16: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్‌ మాయ మాటలను నమ్మె పరిస్థితుల్లో ప్రజలు లేరని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. శనివారం హుజూరాబాద్‌ పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ, టీఆర్‌ఎస్‌లు రెండు కూడ బలుకోని ఉప ఎన్నికలో నాటకాలు ఆడుతున్నాయన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు రెండు ఒక్కటేనన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఉపాధిహామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలింగిచిన చరిత్ర కేసీఆర్‌దన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక నిరుద్యోగులకు ఉద్యోగాలు, దళితులకు మూడెకరాల భూమి హామీని సీఎం కేసీఆర్‌ మరిచిపోయాడన్నారు.  కరోనా సమయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు దొంగ నాటకాలు ఆడి ప్రజల ప్రాణాలు తీశారన్నారు. కేంద్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తుందన్నారు. దేశంలోని నౌకశ్రయం, విమానాలు, రైల్వేలను ప్రైవేట్‌ పరం చేసి కార్పొరేట్‌ చేతుల్లో పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. కాంగ్రెస్‌ సంపాదించిన సంస్థలను పెట్టుబడి దారులకు అప్పనంగా అంటకట్టేందుకు బీజేపీ చూస్తుందన్నారు. నిరుద్యోగ సమస్యలపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌, తాను కొట్లాడామన్నారు. ప్రశ్నించే గొంతును గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T05:06:05+05:30 IST