తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు: ద.మ.రైల్వే
ABN , First Publish Date - 2021-06-18T01:03:54+05:30 IST
రైలు టికెట్ లేకుండా ప్లాట్ ఫాం టికెట్తోనే ప్రయాణం చేయొచ్చన్న వార్తలను దక్షిణ
హైదరాబాద్: రైలు టికెట్ లేకుండా ప్లాట్ ఫాం టికెట్తోనే రైలులో ప్రయాణం చేయొచ్చన్న వార్తలను దక్షిణ మధ్య రైల్వే ఖండించింది. ప్లాట్ ఫాం టికెట్తో రైలులో ప్రయాణం చేయొచ్చన్న ఉత్తర్వులు ఇప్పటికి వరకు రాలేదని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.