రేషన్ సరకుల కోసం కొట్లాట
ABN , First Publish Date - 2020-04-03T11:36:06+05:30 IST
నగరంలో రేషన్ సరకుల కోసం ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ఈ నెల 15 వరకు సరకులు పంపిణీ చేస్తామని అధికారులు స్పష్టంగా చెబుతున్నా వినిపించుకోకుండా మహిళ
విశాఖపట్నం, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): నగరంలో రేషన్ సరకుల కోసం ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. ఈ నెల 15 వరకు సరకులు పంపిణీ చేస్తామని అధికారులు స్పష్టంగా చెబుతున్నా వినిపించుకోకుండా మహిళలు, వృద్ధులు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే డిపోల ముందు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా డిపోల వద్ద ఘర్షణలు జరుగుతున్నాయి. ఎంవీపీ కాలనీలో ప్రథమ ఆస్పత్రి వెనుక డిపోలో సరకుల కోసం మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. మితిమీరి ప్రవర్తిస్తే పోలీసు కేసులు పెడతామని హెచ్చరించారు.