ప్రజల కష్టాలు తీరాలి: తిక్కారెడ్డి
ABN , First Publish Date - 2021-10-17T06:12:04+05:30 IST
మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజల కష్టాలుతీరి రైతులు పాడిపంటలతో సుఖంగా జీవించాలని టీడీపీ మంత్రాలయం ఇన్చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.
మంత్రాలయం,అక్టోబరు 16. మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజల కష్టాలుతీరి రైతులు పాడిపంటలతో సుఖంగా జీవించాలని టీడీపీ మంత్రాలయం ఇన్చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. విజయదశమి వేడుకలను పురస్కరించుకొని రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయదశమి నుంచి రైతుల కష్టాలు తీరాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఉండాలని రైతన్నల శ్రమకు తగినఫలితం లభించాలని స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. అంతకు ముందు గ్రామదేవతను దర్శించుకున్నారు. మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు మెమెంటో, శేషవస్త్రం, ఫల, పుష్ప, మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పన్నాగవెంకటేశ్, నాగిరెడ్డి, యోబు, నరసింహులు, సూగూరు భాస్కర్రెడ్డి, మేకల నరసింహులు పాల్గ్గొన్నారు.