ప్రజల ఆరోగ్యమే ధ్యేయం

ABN , First Publish Date - 2021-05-08T04:33:13+05:30 IST

ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని వనపర్తి మున్సిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌ అన్నారు.

ప్రజల ఆరోగ్యమే ధ్యేయం
చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, కౌన్సిల్‌ సభ్యులు

- మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌

- ఆస్పత్రి ప్రాంగణంలో చలివేంద్రం ప్రారంభం

వనపర్తి వైద్యవిభాగం, మే 7: ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని వనపర్తి మున్సిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో కొవిడ్‌ రోగుల సహయకుల కోసం చలివేంద్రాన్ని కౌన్సిల్‌ సభ్యులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ రోజురోజుకి విజృంభిస్తున్న త రుణంలో  రోగుల కుటుంబ సభ్యులకు తమ వం తు చేయూత ఇవ్వడం కోసమే మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యుల తీర్మానంలో చలివేంద్రం ఏర్పాటు చేశామ న్నారు.  దాతలు ముందుకొస్తే కరోనా రోగులకు   పౌష్టికాహారం పంపిణీ  చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పట్టణ ప్రజలు కరోనా ని బంధనలు పాటించి, అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని కోరారు. కార్యక్రమంలో ముని సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, ఆస్పత్రి  సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హరీశ్‌సాగర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-08T04:33:13+05:30 IST