బాల్కనీలకు బుట్టలను వేలాడదీస్తున్న ప్రజలు! ఎందుకో తెలిస్తే..

ABN , First Publish Date - 2020-04-02T21:37:56+05:30 IST

ఫ్రాన్స్ ప్రజలు ఇటువంటి వారిని ఆదుకునేందుకు విన్నూత్న పద్ధతికి తెరలేపారు. ఆహారాన్ని బుట్టల్లో పెట్టి వాటిని ఇళ్లలోని బాల్కనీల నుంచి వేలాడదీస్తున్నారు.

బాల్కనీలకు బుట్టలను వేలాడదీస్తున్న ప్రజలు! ఎందుకో తెలిస్తే..

నేపుల్స్: కరోనా మహ్మమ్మారి కారణంగా నిరుపేదలు, వీధుల్లో నివసించే వారు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇటువంటి వారిని ఆదుకునేందుకు ఫ్రాన్స్  ప్రజలు వినూత్న పద్ధతికి తెరలేపారు. ఆహారాన్ని బుట్టల్లో పెట్టి వాటిని తమ ఇళ్లలోని బాల్కనీల నుంచి వేలాడదీస్తున్నారు. వీధిలో నిలబడి చేయి చాచితే అందేలా బుట్టలను వేలాడదీస్తున్నారు. స్థానికంగా ఉండే నిరుపేదలు, ఇళ్లు లేని వారు.. ఈ బుట్టల్లోని ఉన్న ఆహారంతో కడుపు నింపుకుంటున్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం తోటివారిని ఆదుకునేందుకే ప్రజలు ఈ కొత్త పద్ధతికి నాంది పలికారు.


మరో విశేషం ఏంటంటే.. కొద్దో గొప్పో రోజు గడుస్తున్నవారెవరైనా సరే..ఈ బుట్టల్లో ఆహారాన్ని ఉంచి పేదలకు తమ వంతు సాయం చేయవచ్చు. తొలుత నేపుల్స్‌లో ప్రారంభమైన ఈ విధానం అతి కొద్ది రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించింది. నేపుల్స్‌ నగరానికి కున్న ప్రాచీన సాంప్రదాయమే ఈ కొత్త విధానానికి మూలం అని స్థానికుడొకరు తెలిపారు. సపోర్ట్ బాస్కెట్స్‌గా పాపులరవుతున్న ఈ విధానానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 



Updated Date - 2020-04-02T21:37:56+05:30 IST