రామాయణం ఎవరు చూస్తారు?.. అని నవ్వారట!
ABN , First Publish Date - 2020-05-23T23:11:22+05:30 IST
రామాయణం టీవీ సీరియల్ను పునఃప్రసారం చేయాలనే ఆలోచన చేసినప్పుడు చాలామంది నవ్వారట.
న్యూఢిల్లీ: రామాయణం టీవీ సీరియల్ను పునఃప్రసారం చేయాలనే ఆలోచన చేసినప్పుడు చాలామంది నవ్వారట. ఆ సీరియల్ను ఇప్పుడెవరు చూస్తారు? అంటూ పళ్లికిలించారట. ఈ విషయాన్ని ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ వేంపటి వెల్లడించారు. ‘డీడీలో రామాయణం పునఃప్రసారం చేయాలని సూచించినప్పుడు చాలామంది సీరియస్గా తీసుకోలేదు. అదెవరు చూస్తారు? అంటూ నవ్వారు’ అని ఆయన చెప్పారు. అయితే ఇది భారతదేశమని, ఇంగ్లీషులో మాట్లాడే కొందరే ఇక్కడ ఉండరని వాళ్లకు శేఖర్ సమాధానమిచ్చారట. ‘భారత్ మిగతా దేశాల్లాంటిది కాదు. ఇది చాలా ప్రత్యేకం’ అని స్పష్టంచేశారట. ఆయన చెప్పినట్లే పునఃప్రసారంలో రామాయణం పలు రికార్డులు బద్దలుకొట్టింది. అత్యధిక వీక్షకులు ఉన్న టీవీ సీరియల్గా చరిత్ర సృష్టించింది. ఈ ఆలోచన విని నవ్విన వారందరి నోళ్లనూ మూయించింది.