అధిక ధరలతో ప్రజలు బెంబేలు

ABN , First Publish Date - 2022-08-27T06:19:25+05:30 IST

వైసీపీ ప్రభుత్వం నిత్యవసర వస్తువులతోపాటు బస్‌చార్జీలు, కరెంటు చార్జీలు పెంచడంతో ప్రజలు అల్లాడిపోతున్నారని టీడీపీ మండల అధ్యక్షులు యోగానంద్‌ అన్నారు.

అధిక ధరలతో ప్రజలు బెంబేలు
బాదుడే-బాదుడు కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

రాచర్ల, ఆగస్టు 26 : వైసీపీ ప్రభుత్వం నిత్యవసర వస్తువులతోపాటు బస్‌చార్జీలు, కరెంటు చార్జీలు పెంచడంతో ప్రజలు అల్లాడిపోతున్నారని టీడీపీ మండల అధ్యక్షులు యోగానంద్‌ అన్నారు. మండలంలోని సత్యవోలు గ్రామంలో శుక్రవారం బాదుడే-బాదుడు కార్యక్రమం నిర్వహించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పంలో జరిగిన ఘటన బాధాకరమైన విషయమని, అన్నా క్యాంటీన్‌ ద్వారా పేదలకు భోజన ఏర్పాట్లు చేస్తే వాటిని వైసీపీ నాయకులు అడ్డుకోవడం శోచనీయమన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు మెచ్చే పరిపాలన టీడీపీతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జీవన్‌రెడ్డి, శ్రీనివాసులు, రామలింగయ్య, శ్రీనివాస్‌యాదవ్‌, కళ్యాణ్‌రెడ్డి, సంజయ్‌, వినోద్‌, హఫీజ్‌ఖాన్‌, రహంతుల్లా, పెద్దపుల్లారెడ్డి, చిన్నపుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-27T06:19:25+05:30 IST