స్టార్ హోటళ్లలో కూర్చున్న వ్యక్తులు pollutionకి రైతులను నిందిస్తున్నారు...సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-11-17T17:59:12+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని వాయుకాలుష్యంపై బుధవారం కూడా సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది....

స్టార్ హోటళ్లలో కూర్చున్న వ్యక్తులు pollutionకి రైతులను నిందిస్తున్నారు...సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని వాయుకాలుష్యంపై బుధవారం కూడా సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘‘ఫైవ్, సెవెన్ స్టార్ హోటళ్లలో కూర్చున్న వ్యక్తులు కాలుష్యానికి రైతులను నిందిస్తున్నారు’’ అని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. స్టార్ హోటళ్లలో కూర్చున్న వ్యక్తులు కాలుష్యానికి కారణమవుతున్నారని సుప్రీం వ్యాఖ్యానించింది.నిషేధం ఉన్నప్పటికీ పటాకులు కాల్చిన విషయాన్ని విస్మరిస్తున్నామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.అనుమతి లేని ఇంధనాన్ని ఉపయోగించే పరిశ్రమలను మూసివేయాలని ఢిల్లీ, ఇతర ఎన్‌సిఆర్ రాష్ట్రాల్లో గాలి నాణ్యత నిర్వహణ కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. 


కేంద్రం ప్రతిపాదించిన వాటిలో 90 శాతం తామే చేశామని, పగలు, రాత్రి పెట్రోలింగ్‌తో తాము పరిశీలిస్తున్నామని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.గోధుమ పొట్టు  తగులబెట్టకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా మేజిస్ట్రేట్‌లను ఆదేశించామని హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.


Updated Date - 2021-11-17T17:59:12+05:30 IST